byసూర్య | Tue, Dec 06, 2022, 04:17 PM
నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి మండలం ఇనుపాముల గ్రామంలో జాల సత్తిరెడ్డి ఆనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే చురుమర్తి లింగయ్య సత్తిరెడ్డి మృతదేహానికి పులా మాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన కిన్నెర రాములు ఆనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన దర్శనపు లింగయ్య భార్య హాస్పిటల్ లో చికిత్స పొందగా వారిని పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన జాల కృష్ణరెడ్డి గారి కుమార్తె పాయిజన్ తీసుకోవడంతో వారి కుమార్తె ను పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకుని రూ.10 వేల ఆర్ధిక సహాయం చేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన కుంభం గోపమ్మ ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.