byసూర్య | Tue, Dec 06, 2022, 12:35 PM
తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉ.11 గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకుంటారు. టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత రూ.110 కోట్లతో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మోతే గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరగసభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.