byసూర్య | Tue, Dec 06, 2022, 12:24 PM
పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం శంకరపల్లి మండ లంలోని వేరిగూడ గ్రామానికి చెందిన కె. కృష్ణకు 3, 50, 000 సీఎం సహాయనిధి ఎల్. ఓ. సి పత్రం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేదల ఆరోగ్య కాపాడేందుకు కావాల్సిన ఆర్థిక సహాయం సీఎం సహాయనిధి నుంచి పెద్ద సంఖ్యలో ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఆపదలో ఉన్నారని వారికి ఆర్థికంగా సీఎం సహాయనిధి అండగా ఉంటుందని చెప్పారు.