byసూర్య | Sun, Dec 04, 2022, 08:36 PM
మహబూబ్నగర్లో టీఆర్ఎస్ కార్యాలయం, కలెక్టరేట్ భవనాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గురించి ప్రస్తావించారు.ప్రజలు హామీ ఇస్తే బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వస్తానన్నారు.తెలంగాణ తరహాలో భారతదేశాన్ని అభివృద్ధి చేద్దాం' అని కేసీఆర్ పిలుపునిచ్చారు.తెలంగాణ కోసం బీజేపీ నేతలు ఏమీ చేయరని, చేసేవారికి అడ్డంకులు సృష్టిస్తారని అన్నారు. మోదీ ప్రభుత్వం వల్ల తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల నష్టం వచ్చిందన్నారు.