byసూర్య | Thu, Dec 01, 2022, 08:49 PM
కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ కేసు ఇప్పటికే క్లోజ్ కాగా... ఈ కేసును రీఓపెన్ చేయిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ లో గురువారం మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఈ క్రమంలో బెంగళూరు డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల పాత్ర ఉందని బెంగళూరు పోలీసులు నిర్ధారించారన్నారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరు పోలీసులకు డబ్బులిచ్చి మరీ కేసును కొట్టివేయించుకున్నారన్నారు. కర్ణాటకలో తమ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా టీఆర్ఎస్ నేతలు ఈ కేసులో తమ పేర్లను కొట్టివేయించుకున్నారని ఆయన చెప్పారు.