byసూర్య | Thu, Dec 01, 2022, 02:14 PM
పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 3వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సబ్ జూనియర్ బాల, బాలికల జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తోట శంకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022 జనవరి 1 నాటికి 16 సంవత్సరాలలోపు బాల, బాలికలు వయస్సు ధృవీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని ఈనెల 16 నుండి 19 వరకు మంచిర్యాలలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9949842453, 9248046244 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.