byసూర్య | Thu, Dec 01, 2022, 01:22 PM
రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గే మల్లేశం ఆధ్వర్యంలో బుధవారం ప్రగతిభవన్లో కలిశారు. ఈ సందర్భంగా సంఘం సమస్యలను మంత్రికి వివరించారు. అదేవిధంగా చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి మాదిరిగా, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కురుమ ముద్దుబిడ్డ దొడ్డి కొమురయ్య జయంతి వర్ధంతి దినోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ట్యాంక్ బండ్ సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు నగేష్ యాదవ్ తో కలిసి మంత్రి కేటీఆర్ కు వినతి పత్రాన్ని అందించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ అందుకు అనుగుణంగా హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర నాయకులు మల్లేశం, అరుణ్ కుమార్, నరసింహ, నారాయణ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.