byసూర్య | Thu, Dec 01, 2022, 01:20 PM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే 143 సభ్యత్వా నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం మండల పరిషత్తు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వడ్ల ఆనంద్ చారి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదులు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు ఆనంద్ చారి మాట్లాడుతూ ఆయా పత్రికలు చానల్లో పనిచేసే జర్నలిస్టులు టి యు డబ్ల్యూ సభ్యత్వాలు తీసుకోవాలని కోరారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం సంఘటితంగా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సత్యనారాయణ, శ్రీధర్ చారి, సాయికుమార్, సత్యం తదితరులు పాల్గొన్నారు.