byసూర్య | Thu, Dec 01, 2022, 01:17 PM
ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన అభివృద్ధి పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బుధవారం బొల్లారం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశాన్ని తాత్కాలిక భవనంలో చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 59 లక్షలతో చేపట్టనున్న ఇంజినీరింగ్ అభివృద్ధి పనులకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. డీపీఆర్ నివేదికను తయారు చేసి నిధులను కేటాయించారు. అనంతరం పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లోని సమస్యలను ప్రస్తావించి పరిష్కరించాలని కోరారు. చైర్పర్సన్ రోజాబాల్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మున్సిపా లిటీల అభివృద్ధికి కేటాయించిన ఎస్పీఎఫ్ నిధులతో వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మున్సిప ల్లో ప్రస్తుతం మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణ పనుల కోసం రోడ్ల తవ్వకాలు జరుగుతున్నాయని, పనులు పూర్తవగానే రోడ్ల నిర్మా ణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఆమె సభలో తెలిపారు. అన్ని విభాగాల్లో మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయా లని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ రాజేంద్రకుమార్, మున్సి పల్ వైస్ చైర్మన్ అనిల్కుమార్రెడ్డి, ఆర్వో శ్రీధర్, మున్సిపల్ మేనే జర్ నిర్మల, డీఈ ఇంతియాజ్, ఏఈ శ్రీకాంత్, శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, పర్యావరణ ఇంజినీర్ సాయికిరణ్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.