ఆర్టీసీ డిఎం ను సన్మానించిన వైశ్య సంఘం ప్రతినిధులు

byసూర్య | Thu, Dec 01, 2022, 01:14 PM

సంగారెడ్డి జిల్లా లోని మండల కేంద్రమైన నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేషయ్యకు స్థానిక ఆలయ నిర్వహకులు, పట్టణ వైశ్య సంఘం ప్రతినిధులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మార్గశిర మాసం రెండో గురువారం సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక వేడుక కార్యక్రమంలో వారు పాల్గొని పూజలు చేశారు. అనంతరం అర్చకులు మంగళ హారతి నిరాజనం చేసి బాబాకు నైవేద్యం నివేదన చేశారు. భక్తులకు ప్రసాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం ప్రతినిధులు మునిగ్యాల మాణిక్ ప్రభుసేటు, ఆలయ అర్చకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM