పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి
byసూర్య |
Thu, Dec 01, 2022, 01:05 PM
మేడ్చల్ మల్కాజ్గిరి నగరం మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపల్ పరిధిలో దాదాపు 10కోట్ల 10లక్షలతో స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ, సీ.సీ రోడ్డు, పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్, మున్సిపల్ కమిషనర్ వాణి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, అధికారులు, పార్టీ అధ్యక్షులు శ్రీధర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Latest News