byసూర్య | Thu, Dec 01, 2022, 01:03 PM
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్లూరు గ్రామ శివారులో ఈరోజు(గురువారం) రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని ఒకరు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. మృతుడు ఈదులనాగులపల్లి కి చెందిన వెంకట్ రావు(23) గా గుర్తింపు. ప్రొద్దటూర్ గ్రామంలో పని ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగ వస్తున్న వాహనదారుడు వెలిమెలా గ్రామానికి చెందిన రాజు కు గాయాలైనట్టు సమాచారం. ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న రామచంద్రపురం పోలీసులు.