నిరుద్యోగులకు శుభవార్త
byసూర్య |
Thu, Dec 01, 2022, 12:59 PM
రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. కంటివెలుగు పథకం అమలులో భాగంగా 1,491 పారామెడికల్ ఆప్తాలమిక్ ఆఫీసర్ల తాత్కాలిక నియామకానికి నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నోటిఫికేషన్ ను జిల్లాల వారీగా కలెక్టర్లు విడుదల చేయనున్నారు. ఈ నెల 5న ఇంటర్వ్యూలు నిర్వహించి 7న మెరిట్ జాబితా మూసాయిదాను విడుదల చేయనున్నారు. ఈ నెల 8 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 10న ఫైనల్ మెరిట్ జాబితాను రిలీజ్ చేయనున్నారు. కాగా, సెలక్టైన అభ్యర్థులకు ప్రభుత్వం 30 వేల వేతనాన్ని చెల్లించనుంది.
Latest News