byసూర్య | Thu, Dec 01, 2022, 12:56 PM
డిండి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి తిరపతయ్య మృతి బాధాకరం అని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం తిరపతయ్య మృత దేహానికి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరపతయ్య మృతి పార్టీకి లోటని అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ పొలగొని రవీందర్ రావు, ఉప సర్పంచ్ లక్ష్మీ, నక్క జంగయ్య, రామకృష్ణ, హన్మంత్, బాబు, తదితరులు పాల్గొన్నారు.