byసూర్య | Thu, Dec 01, 2022, 12:43 PM
రాజపేట మండలం లోని రఘునాధపురం గ్రామాన్ని మండలం ఏర్పాటుగా ప్రభుత్వం పరిపాలన దిశగా, పరిసర ప్రాంత గ్రామల ప్రజల దుష్ట గెజిట్ ను విడుదలచేయలని కోరుతు జేఏసీ సభ్యులు113 వ రోజు బుధవారం, శ్రీకాళహస్తి, దేవస్థానం లో ఉన్న శ్రీకాళహస్తి ఈశ్వరుని జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని దర్శించుకుని రఘునాధపురం అతి త్వరగా మండల కావాలని ఆలయంలో రాహు కేతు పూజ నిర్వహించడం జరిగింది. అలాగే శ్రీశైలం, దేవస్థానం లో ఉన్న , శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జేఏసీ సభ్యులకు వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు, యాదగిరిగుట్ట మండలం, చిన్న గౌరాయపల్లి ఉపసర్పంచ్ ఉప సర్పంచుల ఫోరం జనరల్ సెక్రెటరీ, గంజి పాండురంగం, రఘునాథపురం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు సామల భాస్కర్, జేఏసీ సభ్యులు నల్ల పాండు, చిన్న గౌరాయపల్లి వార్డు సభ్యులు కొంగరి రాజు, ఎక్కల్ దేవి చంద్రశేఖర్, నల్ల అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.