byసూర్య | Thu, Dec 01, 2022, 12:43 PM
యాదగిరిగుట్ట పట్టణంలో ఆరో వార్డుకు చెందిన పలువురు టిఆర్ఎస్ నాయకులు టిపిసిసి సభ్యులు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బీర్ల అయిలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ బీర్ల అయిలన్న చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరాము అని తెలిపారు. పార్టీ కోసం ఎల్లవేళలా కృషి చేస్తామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.
పార్టీలోకి కొత్తగా చేరిన శివరాత్రి సురేష్, శంకరాచారి, కొలనుపాక జీవ, గంధముల ప్రశాంత్ కు బీర్ల అయిలయ్య గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డీ, సీనియర్ నాయకులు కొమ్మగని శంకర్, రాజపేట మండల అధ్యక్షుడు మహేందర్ గౌడ్, మండల నాయకులు బసవరాజ్ సురేష్, తదతరులు పాల్గొన్నారు.