ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్
byసూర్య |
Thu, Dec 01, 2022, 11:58 AM
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ లకు రూ.3 లక్షల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. ప్రతి సోమవారం సిట్ ముందు హాజరు కావాలని నిందితులను హైకోర్టు ఆదేశించింది. ముగ్గురి పాస్ పోర్టులు పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయాలని ఆదేశించింది.
Latest News