నేడు సీబీఐ విచారణకు టీఆర్ఎస్ మంత్రి, ఎంపీ..!
byసూర్య |
Thu, Dec 01, 2022, 11:44 AM
నేడు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. ఇటీవల తాను సీబీఐ అధికారినంటూ శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు పలువురిని కలిశాడు. కానీ అతను సీబీఐ అధికారి కాదు. దీంతో ఈ నకిలీ సీబీఐ అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మంత్రి గంగులను సీబీఐ సాక్షిగా చేర్చింది. దీంతో ఈ కేసు విషయమై మంత్రి గంగులతో పాటు, ఎంపీ రవిచంద్రను సీబీఐ విచారించనుంది.
Latest News