byసూర్య | Thu, Dec 01, 2022, 11:40 AM
సంగారెడ్డి జిల్లా సహా రాష్ట్రంలో ఇళ్ల జాగాలు లేని పేదలకు 100 గజాల చొప్పున స్థలాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ మేరకు బుధవారం సీఎంకు లేఖ రాశాను అన్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడుగుతానని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తానని బుధవారం మీడియా ప్రెస్ మీట్ లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయం అంతా గందరగోళంగా ఉందని అన్నీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రలో ఉంది కానీ కాంగ్రెస్ లేదని వ్యాఖ్యానించారు.