byసూర్య | Thu, Dec 01, 2022, 11:25 AM
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తాగు నీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగానే మంచినీటి సరఫరా లేని కాలనీలకు 4 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం వాటర్ వర్క్స్ అధికారులతో తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి కాలనీకి తాగునీరు సరఫరా చేసి నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చంపాపేట డివిజన్లో మారుతీనగర్, మహంకాళీ తోవట, యాదగిరి నగర్, దుర్గభవానీనగర్, మన్సూరాబాద్ డివిజన్ లోని పర్వత్ నగర్ , స్వాతి రెసిడెన్సీ, దుర్గానగర్, విష్ణునగర్, ఎల్లారెడ్డి కాలనీ, సిరిహిల్స్, భవానీనగర్, విజయ్ శ్రీ కాలనీ, మధురానగర్, షిరిడీనగర్, సూర్యానగర్, నందిహిల్స్ తదితర కాలనీలో ఈ నిధులతో మంచినీటి పైప్ లైన్లు వేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నామని తెలిపారు. ఈ పనులను వేగవంతంగా చేసి త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వచ్చే వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ఇప్పుటి నుంచే అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.