ప్రతి ఇంటికి తాగు నీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

byసూర్య | Thu, Dec 01, 2022, 11:25 AM

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తాగు నీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగానే మంచినీటి సరఫరా లేని కాలనీలకు 4 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం వాటర్ వర్క్స్ అధికారులతో తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి కాలనీకి తాగునీరు సరఫరా చేసి నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చంపాపేట డివిజన్లో మారుతీనగర్, మహంకాళీ తోవట, యాదగిరి నగర్, దుర్గభవానీనగర్, మన్సూరాబాద్ డివిజన్ లోని పర్వత్ నగర్ , స్వాతి రెసిడెన్సీ, దుర్గానగర్, విష్ణునగర్, ఎల్లారెడ్డి కాలనీ, సిరిహిల్స్, భవానీనగర్, విజయ్ శ్రీ కాలనీ, మధురానగర్, షిరిడీనగర్, సూర్యానగర్, నందిహిల్స్ తదితర కాలనీలో ఈ నిధులతో మంచినీటి పైప్ లైన్లు వేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నామని తెలిపారు. ఈ పనులను వేగవంతంగా చేసి త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వచ్చే వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ఇప్పుటి నుంచే అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. 


Latest News
 

సోమగూడెంలో రూ. 90 వేల నగదు పట్టివేత Fri, Mar 29, 2024, 08:37 PM
మానవాళి కోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగం Fri, Mar 29, 2024, 08:36 PM
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు Fri, Mar 29, 2024, 08:34 PM
ఆపరేషన్ నిమిత్తమై రక్తం అందజేత Fri, Mar 29, 2024, 08:33 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్లు Fri, Mar 29, 2024, 08:32 PM