నేటి నుండి షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం
byసూర్య |
Thu, Dec 01, 2022, 11:15 AM
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర నేటి నుండి తిరిగి ప్రారంభం కానుంది. వరంగల్ జిల్లా నర్సంపేట లింగగిరి నుండి ఆమె పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. ఎక్కడైతే తనను అరెస్టు చేశారో అక్కడినుండే షర్మిల పాదయాత్రను మొదలు పెట్టనున్నారు. కాగా, పాదయాత్ర ప్రారంభించే ముందు ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను షర్మిల కలవనున్నారు. గత నాలుగు రోజులుగా జరిగిన పరిణామాలను షర్మిల గవర్నర్ కు వివరించనున్నారు.
Latest News