byసూర్య | Thu, Dec 01, 2022, 11:10 AM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన పేరు రావడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 'ఈ 9 ఏళ్లలో బీజేపీ పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టింది. బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది. తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇవాళ మోడీ కంటే ముందు ఈడీ వచ్చింది. నాపై మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టింది. మాపై కేసులు రాజకీయ ఎత్తుగడ. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలడిగితే సమాధానం చెబుతాం. మోడీకి విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ పంథా మార్చుకోవాలి. కేసులు పెట్టుకోండి, అరెస్టులు చేసుకోండి.. జైల్లో పెట్టుకోండి.. భయపడం. జైలుకు వెళ్లడానికైనా సిద్ధం' అని అన్నారు.