byసూర్య | Thu, Dec 01, 2022, 11:08 AM
మోతాదుకు మించి మద్యం సేవించి మద్యం మత్తులో అదుపు తప్పిన వేగంతో దూసుకెళ్లిన వాహనదారుడికి కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష 2100 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నెల 25న బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రవ్ నిర్వహిస్తుండగా రామగుండంకు చెందిన పి. శివకుమార్ అనే యువకుడు మద్యం మత్తులో పట్టుబడ్డాడు. బ్రీత్ అనలైజర్ తో పరీక్షలు నిర్వహించగా రక్తంలో ఆల్కహాలిక్ నిల్వలు 410 ఎంజీగా గుర్తించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. అదే రోజు మొత్తం 9 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా వీరందరినీ నాల్గవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. శివకు మార్ కు జైలు శిక్ష విధించగా, మిగతా వారికి 2100 చొప్పున జరిమానా విధించారు.