ఎన్డీటీవీని అన్ ఫాలో చేస్తున్నా..ట్విట్టర్ లో తెలిపిన కేటీఆర్

byసూర్య | Wed, Nov 30, 2022, 10:58 PM

ఎన్డీటీవీని అన్ ఫాలో చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్  ట్విట్టర్ లోె తెలిపారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ ఆ ఛానల్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ పదవికి ఆయన భార్య రాధికా రాయ్ కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్డీటీవీని అన్ ఫాలో చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు ఎన్డీటీవీ బాగా పని చేసిందని కితాబునిచ్చారు. ఎన్డీటీవీలో మెజారిటీ వాటాను అదానీ గ్రూపు దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎన్డీటీవీ ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ కంపెనీని అదానీ కొనుగోలు చేయడంతో... అదానీ గ్రూప్ కు 29.18 శాతం వాటా లభించింది. అంతేకాదు... బహిరంగ మార్కెట్ ద్వారా మరో 26 శాతం వాటా కోసం బహిరంగ మార్కెట్ ద్వారా ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ పూర్తయితే అదానీ గ్రూప్ వాటా 55.18 శాతానికి పెరుగుతుంది.



Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM