byసూర్య | Wed, Nov 30, 2022, 10:57 PM
మునుగోడు నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ గురువారం పర్యటించనున్నారు. మునుగోడులోని ధనలక్ష్మి ఫంక్షన్ హాలులో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. గతంలో ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై మంత్రి కేటీఆర్ సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ హాజరుకానున్నారు. వీరితో పాటు పలువురు నేతలు కూడా హాజరుకానున్నారు.