వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకు ఆ పార్టీలు: జగ్గారెడ్డి

byసూర్య | Wed, Nov 30, 2022, 10:46 PM

బీజేపీ, వైఎస్సార్‌టీపీ, బీఎస్పీ లాంటి పార్టీలు యాంటీ టీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్‌ను, కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకును చీల్చి చివరికి గులాబీ పార్టీకే మేలు చేస్తాయని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు.  వైఎస్ షర్మిల పాదయాత్ర చివరికి టీఆర్‌ఎస్ పార్టీకే ప్లస్ అవుతుందని ఆయన అన్నారు. బండి సంజయ్, షర్మిల పాదయాత్రతో తెలంగాణ ప్రజలకు ఒరేగేది ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పాదయాత్రల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావనే లేదని విమర్శించారు. 


వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల రాజకీయాలు.. టీఆర్‌ఎస్ పార్టీకే ఉపయోగపడేవిధంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు షర్మిల పార్టీ పని చేస్తోందన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ మాదిరిగానే వైఎస్ షర్మిల కూడా తన పాదయాత్రలో ప్రజా సమస్యల గురించి ప్రస్తావించట్లేదని ఆయన అన్నారు. బండి సంజయ్, షర్మిల పాదయాత్రలతో తెలంగాణకు ఒరిగేదేమీలేదని అన్నారు. చివరికి ఇవన్నీ కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంక్‌ను చీల్చి, టీఆర్‌ఎస్ పార్టీకే మేలు చేస్తాయని ఆయన వివరించారు. వైఎస్సార్‌టీపీ, బీఎస్పీ లాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా పనిచేస్తు్న్నాయని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.


వైఎస్ షర్మిల అరెస్టు వ్యవహారంపై బుధవారం (నవంబర్ 30) ఉదయం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో జగ్గారెడ్డి మాట్లాడారు. షర్మిలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూనే.. తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజల ఇబ్బందులకు పరిష్కారం చూపే దిశగా ఈ పాదయాత్రలు (వైఎస్ షర్మిల, బండి సంజయ్ పాదయాత్రలు) జరగట్లేదు. అల్టిమేట్‌గా వీళ్లందరి ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడమే’ అని జగ్గారెడ్డి అన్నారు. ‘వైఎస్ షర్మిల పార్టీ.. తెలంగాణా అంతటా పోటీ చేస్తుంది. ప్రతి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్ల నుంచి ఆమె పార్టీ 3 నుంచి 4 వేల ఓట్లను తన ఖాతాలో వేసుకుంటుంది. అంటే.. టీఆర్‌ఎస్‌కు ప్లస్ చేసినట్లే కదా..! అట్లనే బీజేపీ కూడా ఇన్‌డైరెక్టుగా యాంటీ టీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్‌‌ను చీలుస్తుంది. బీఎస్పీ పార్టీ ఎస్సీ ఓటు బ్యాంక్‌ చీలుస్తుంది. ఇవన్నీ కలిపి మొత్తంమీద టీఆర్‌ఎస్‌కే ప్లస్ అవుతాయి’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.


హైదరాబాద్‌లో వైఎస్ షర్మిల అరెస్టు వ్యవహారం వివిధ ఇష్యూలను డైవర్ట్ చేసేందుకేనని జగ్గారెడ్డి ఆరోపించారు. ఆ వ్యవహారంలో ప్రజా సమస్యలు ఏవైనా ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ‘నిన్న టీవీల్లో చూశా. దాదాపు 8 గంటల పాటు షర్మిల కారునే చూపించారు. క్రేన్‌తో కారును లేపిందే లేపుడు చూపించారు. అందులో ఏవైనా రైతుల సమస్యలు ఉన్నాయా, యువకుల సమస్యలు ఉన్నాయా? మహిళల సమస్యలు, ఉద్యోగ సమస్యలపై చర్చ ఉందా? పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలపై చర్చ ఉందా?’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం పండుకున్నది, నిద్ర పోతోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పండుకున్నది, నిద్ర పోతోంది. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత విస్తృతమైన పోటీ చేస్తుంది’ అని జగ్గారెడ్డి అన్నారు.



Latest News
 

రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM
చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM