వార్డుకు రెండు బస్తీ దవాఖానాలు,,,జీహెచ్‌ఎంపీ నిర్ణయం

byసూర్య | Wed, Nov 30, 2022, 10:43 PM

హైదరాబాద్ నగర వాసుల కోసం నగరంలో కొత్తగా మరో 37 బస్తీ దవాఖానాలను ప్రారంభించాలని జీహెచ్‌ఎంపీ  నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 వార్డులు ఉండగా.. 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంటే ఒక్కొ వార్డులో రెండు బస్తీ దవాఖానాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా 263 బస్తీ దావాఖానాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వీటితో తోడు ఇప్పుడు కొత్తగా 37 బస్తీ దవాఖానాలను త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.


కొత్తగా ఏర్పాటు చేయనున్న 37 బస్తీ దవాఖానాలతో కలిసి మొత్తం 300 దవాఖానాలు అవ్వనున్నాయి. నగరంలోని పేదలకు ఈ బస్తీ దవాఖానాలు బాగా ఉపయోగపడనున్నాయి. రోగులకు ఉచితంగా వైద్యంతో పాటు మందులు కూడా ప్రభుత్వం ఫ్రీగా అందిస్తోంది. ఇప్పటికే ఏర్పాటు అయిన 263 బస్తీ దవాఖానాలు విజయవంతంగా నడుస్తోన్నాయి. బస్తీ దావాఖానాలకు వచ్చే రోగుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతోంది. నగరంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలకు బస్తీ దావాఖానాలు ఉపయోగకరంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.


ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో ట్రీట్‌మెంట్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చులు భరించలేని ప్రజలు బస్తీ దవాఖానాలకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. బస్తీ దవాఖానాలలో 57 రకాల మెడికల్ సర్వీసులతో పాటు ఓపీ సర్వీసులు అందిస్తున్నారు. అలాగే కొన్ని సాధారణ టెస్టులు కూడా బస్తీ దవాఖానాలలో చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ, శిశు పరీక్షలతో పాటు ఇమ్యునైజేషన్లు, రక్తహీనత, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి టెస్టులు బస్తీ దవాఖానాలలో చేస్తున్నారు.


అలాగే బస్తీ దవాఖానాలలో పనిచేసే సిబ్బంది స్థానికంగా నివసించే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుతున్నారు. దీని వల్ల ప్రజలు సీజనల్ వ్యాధుల సోకకుండా తమను తాము రక్షించుకుంటున్నారు. చిన్న రోగాలకు బస్తీ దవాఖానాలలోనే చికిత్స అందిస్తున్నారు. ఇక పెద్ద కేసులను హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులకు సిబ్బంది రిఫర్ చేస్తోన్నారు. ఇదిలావుంటే ఆరోగ్య తెలంగాణ లక్ష్యంలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తొలుత హైదరాాబాద్‌లో ప్రయోగాత్మకంగా బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఇవి సక్సెస్ కావడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో గ్రామాలు, పట్టణాలలో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.



Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM