byసూర్య | Wed, Nov 30, 2022, 09:08 PM
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలుగు ప్రజా ప్రతినిధుల పేర్లు బయటకు వస్తున్నాయి. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత, ఏపీలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును ఈడీ ప్రస్తావించింది. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మాగుంట గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.