సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,,,పలక్ నూమా ఏసీపీ షేక్ జహంగీకర్

byసూర్య | Wed, Nov 30, 2022, 07:58 PM

సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయని, వారు చేసే మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగితే మాత్రం వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చని ఫలక్ నూమా ఏసీపీ షేక్ జహంగీర్ వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల చేసే నేరాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు తాము ఇప్పటికే ప్రారంభించామన్నారు. చంద్రయాణ్ గుట్టా, ఫలక్ నూమా పరిధిలో వివిధ బస్తీలలో సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచామన్నారు. మున్ముందు అన్ని ప్రాంతాల్లోని ప్రజలను ఈ నేరాల  పట్ల అప్రమత్తం చేస్తామన్నారు. వీటిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని ప్రజలు సైబర్ నేరగాళ వల్లలో చిక్కకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.  సైబర్ నేరగాళ నాలుగు రూపాల్లో నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మొబైల్ ఫోన్లకు వివిధ పేర్లతో ఓటీపీ పంపి ఆపై ఫోన్ చేసి ఓటీపీ చెప్పాలని అడిగి వాటిని తెలుసుకొని ప్రజల ఖాతాలోని డబ్బు కాజేస్తున్నారని వెల్లడించారు. ఏ బ్యాంకు కూడా తన కస్టమర్ కు ఫోన్ చేసి ఓటీపీ అడగదని, ఏమైన సమస్యవుంటే కస్టమర్ కు బ్యాంకుకే పిలుస్తారని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి ఎవరైనా ఫలాన బ్యాంకు పేరుతో మీకు వచ్చిన ఓటీపీ చెప్పండి అంటే అట్టి ఫోన్ కాల్ ను కట్ట చేయాలని, దీనిపై అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. నిరుద్యోగ యువత జాబ్ ల కోసం నేటి రోజుల్లో ఆన్ లైన్ లో వెతుకుతుంటారని, అట్టి వారిని గ్రహించిన సైబర్ నేరగాళ్ల ఫలాన చోట జాబ్ ఉందన్న లింక్ లు పంపుతారని, అలాంటి లింక్ ల పట్ల  నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ షేక్ జహంగీర్ సూచించారు. అదే సందర్భంలో ఫలాన ఉద్యోగ అప్లికేషన్ తదితర వాటికి ఇంత ఫీజు చెల్లించాలని వ్యక్తిగత ఫోన్, గూగుల్ పే నెంబర్ల అడుగుతుంటారని, ఆ తరువాత ఖాతాలో డబ్బును సైబర్ నేరగాళ్లు కాజేస్తారని ఆయన తెలిపారు. ఇలాంటి ఫేక్ జాబ్ లింక్ పంపేవారి పట్ల, ఫీజు చెల్లించాలని కోరే వారి పట్ల యువత ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సోషల్ మీడియాలోని వ్యక్తిగత ఖాతాలలోకి సైబర్ నేరగాళ్లు చొరబడి వీడియో ఫోన్ కాల్స్, వ్యక్తుల  ఫ్రెండ్స్ డాటా సేకరించి డబ్బు సహాయం కోరుతూ కూడా నేరగాళ్ల మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల విషయంలో ఎప్పటికపుడు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎవరైనా తమ ఖాతాలోకి చొరబడి వాటిని దుర్వినియోగం చేస్తున్నారని తేలితే బాధితులు తమ ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖతాలను వెంటనే లాక్ చేసుకొనేలా అప్రమత్తంగా ఉండాలన్నారు.  ఈ సైబర్ నేరాలతోపాటు మత్తు పదార్థాలు వినియోగించే వారిపైనా, అమ్మకాలపైనా కూడా ఉక్కుపాదం మోపుతున్నట్లు ఏసీపీ షేక్ జహంగీర్ వెల్లడించారు. ఎదైనా నేరం జరిగితే 100కు ఫోన్ చేయాలన్నారు. సైబర్ నేరగాళ్ల తమ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కాజేస్తే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు  చేస్తే కాజేసిన సొమ్మును తిరిగి రాబట్టవచ్చని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనంలోకి తీసుకోవాలన్నారు. తమ పరిధిలో రౌడీ షీటర్లకు అనునిత్యం కౌన్సిలింగ్ ఇచ్చి సత్ ప్రవర్తన వైపునకు తీసుకొస్తున్నామన్నారు. తీరుమారని రౌడీ షీటర్లపై మాత్రం ఉక్కపాదం మోపుతున్నామన్నారు. తమ స్టేషన్ పరిధిలో కొందరు రౌడీ షీటర్ల సత్ ప్రవర్తనతో నడుచుకోవడం వల్ల దాదాపు 47 మందిపై రౌడీ షీట్లను కూడా ఎత్తివేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడంతోపాటు వారిలో సత్ ప్రవర్తన కోసం కూాడా తాము ప్రయత్నిస్తున్నామన్నారు. 


 


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM