టీఆర్ఎస్ చేసింది తాను చేశానని చెప్పుకొంటున్న రఘునందన్: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

byసూర్య | Wed, Nov 30, 2022, 07:54 PM

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చేసినా తానే చేసినట్టు చెప్పుకుంటున్నారని... నేషనల్ హైవేలు కూడా తానే తెచ్చినట్టు చెప్పుకుంటున్నారని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే బాధ ప్రజల్లో ఉందని... ఒక దరిద్రుడు ఇక్కడ ఎమ్మెల్యే కావడమే మన దురదృష్టమని మండిపడ్డారు. తన వల్లే భుంపల్లి మండలం వచ్చిందని సిగ్గు, శరం లేకుండా రఘునందన్ రావు చెప్పుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చేసినా తానే చేసినట్టు చెప్పుకుంటున్నారని... నేషనల్ హైవేలు కూడా తానే తెచ్చినట్టు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. 


నేషనల్ హైవేలకు, ఎమ్మెల్యేలకు ఏమైనా సంబంధం ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. అబద్ధాల యూనివర్శిటీ ఉంటే దానికి రఘునందన్ వైస్ ఛాన్సలర్ అవుతారని ఎద్దేవా చేశారు. మొన్న ఉప ఎన్నికలో ఏదో పొరపాటు జరిగి ఆయన గెలిచారని... మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా మనం చూసుకోవాలని అన్నారు.



Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM