byసూర్య | Wed, Nov 30, 2022, 07:53 PM
ఫలక్ నూమా ఏసీపీ షేక్ జహంగీర్ పర్యవేక్షణలో పాతబస్తీలోని తీగలకుంటలో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాల రికార్డులు సరిగా ఉన్నాయా లేదా అన్న దానిపై పోలీసులు పర్యవేక్షణ కొనసాగింది. అదే సందర్భంలో ఎలాంటి నేరాలతో సంబంధం లేకుండా సత్ ప్రవర్తన కోసం కూడా పోలీసులు కొందరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా సత్ ప్రవర్తనతో మెలిగేలా ఓ ఆటో డ్రైవర్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. అదే సమయంలో అక్కడే సైబర్ నేరాలు ఏ తరహాలో జరుగుతున్నాయా, వాటి పట్ల ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాట్రో కారుతోపాటు బ్లూ కోల్ట్ ఏఎస్ఐ అధికారులు పాల్గొన్నారు.