byసూర్య | Wed, Nov 30, 2022, 06:07 PM
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం రాజ్భవన్కు వెళ్లనున్నారు. రేపు ఉదయం 11:30 గంటలకు షర్మిల గవర్నర్ తమిళిసైని కలవనున్నారు. మంగళవారం షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై గవర్నర్ ట్విట్టర్ ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. షర్మిల కారులో ఉండగానే ఆమె కారును లాక్కెళ్లిన దృశ్యాలు తనను కలవరపరిచాయని గవర్నర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో షర్మిల గవర్నర్తో భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.