ఆపదలో అండగా సీఎం సహాయనిది: ఎమ్మెల్యే
byసూర్య |
Wed, Nov 30, 2022, 04:46 PM
ముఖ్యమంత్రి సహాయనిది నిరుపేదలకు వరంగా మారిందని, ఆపత్కాలం ఆదుకుంటూ రోగుల్లో భరోసా నింపుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ తొర్రుర్ కి చెందిన మేకం నరసింహ కి 1, 00, 000, కోహెడకి చెందిన అక్కి యశోదకి 1, 00, 000 రూపాయల ఎల్ఓసి ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు చేయించి బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి అందజేశారు.
Latest News