విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలి: మంత్రి తలసాని
byసూర్య |
Wed, Nov 30, 2022, 03:36 PM
సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో ప్రైవేటు రికగ్నైజ్డ్ స్కూల్స్ విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్లో వెయ్యికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నిరంతరం తరగతి గదులు, పరీక్షలకు సిద్ధం కావడం వల్ల ఓత్తిడి నుండి విద్యార్థులకు క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుంది అన్నారు. విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించే విధంగా పోటీలను నిర్వహించడం పట్ల రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ను మంత్రి తలసాని అభినందించారు.
Latest News