సుబ్రహ్మణ్య స్వామికి మంత్రి ప్రత్యేక పూజలు
byసూర్య |
Tue, Nov 29, 2022, 02:54 PM
సుబ్రమణ్య షష్టి సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని వల్లి దేవసేన సుబ్రమణ్య స్వామి ఆలయంలో ప్రత్యెక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నూతనంగా దాతలు అందజేసిన 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈఓ , చైర్మన్ చాంబర్ లు, ఆఫీస్, మినీ కళ్యాణ మండపాలను మంత్రి ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తుల కు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు, అధికారులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈ ఓ సుధాకర్, చైర్మన్ సంతోష్ యాదవ్, సభ్యులు పద్మజ, భువనేశ్వరి, ఆకుల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Latest News