byసూర్య | Tue, Nov 29, 2022, 02:32 PM
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లంపేట్ వాసులు ఈ రోజు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రోడ్డు విస్తరణలో తమ నివాసాలను కోల్పోతున్నామని, న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, హన్మంతరావు, మాదాసు వెంకటేశం, ఎంబరి ఆంజనేయులు, ప్రజలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.