byసూర్య | Tue, Nov 29, 2022, 02:31 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నత్తనడకలు కొనసాగుతున్న మినీ స్టేడియంను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. 2014లో అప్పటి స్పీకర్ మధుసూదనా చారి చేతులమీదుగా శంకుస్థాపన చేసిన మినీ స్టేడియం 8 సంవత్సరాలు కావస్తున్న నిర్మాణం పూర్తి కాకపోవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానిక క్రీడాకారులకు క్రీడా ప్రాంగణం లేకపోవడంతో క్రీడలకు దూరం అవ్వాల్సిన పరిస్థితి నియోజకవర్గం లో ఏర్పడిందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి స్థానిక ప్రజా ప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే క్రీడా ప్రాంగణ నిర్మాణం పూర్తి చేసి క్రీడాకారులకు ఉపయోగపడే విధంగ వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.