byసూర్య | Tue, Nov 29, 2022, 01:17 PM
పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రతి గ్రామాల్లో పోస్టల్ సిబ్బంది పథకాలు అవగాహన కార్యక్రమం పెట్టి ప్రజలకు తెలియచేశారు. ఇందులో భాగంగా గజులపల్లి పోస్ట్ ఆఫీస్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మేళాను నిర్వహించి ప్రజలకు పీఓఎస్బీ, ఆర్డీ, ఎస్ఎస్ఏ, ఆర్పీఎల్ఐ, పీఎల్ఐ ఖాతాలను గురించి వివరించడం జరిగింది. ఈ మేళాలో మెలోవర్సిస్ పోచయ్య, గ్రామ సర్పంచ్, సుధాకర్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ల్, రఘు, సుమంత్, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.