byసూర్య | Tue, Nov 29, 2022, 01:16 PM
తేదీ 29 -11-2022 రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని జడ్. పి. హెచ్. ఎస్ నందు 9, 10 తరగతి తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఆంగ్ల నిఘంటువు పై పోటీలు గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకుడు గంగిశెట్టి జగదీశ్వర్ నిర్వహించారు. గతంలో ట్రస్ట్ వారు అందించిన నిఘంటువులను ఉపయోగించి ఇచ్చిన పదములకు అర్థములు నిర్ణీత సమయంలో సరిగ్గా వ్రాయడంలో మంచి ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు ట్రస్ట్ వారు బహుమతులు మరియు మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమము పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య, ఆంగ్ల ఉపాధ్యాయులు సిహెచ్. వేణు, కొండ సత్యనారాయణ, ట్రస్ట్ వ్యవస్థాపకుడు గంగిశెట్టి జగదీశ్వర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందము, విద్యార్థులు పాల్గొన్నారు.