byసూర్య | Thu, Nov 24, 2022, 07:57 PM
డిసెంబర్లో వారం రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఈరోజు ఆదేశించారు. ఈ సమావేశాల్లో ఆర్థిక పరిస్థితి, కేంద్ర ఆంక్షలపై ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధించిన అనవసర ఆంక్షల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాబడిలో రూ.40 వేలకోట్లకు పైగా తగ్గుదల వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు.