byసూర్య | Thu, Nov 24, 2022, 04:17 PM
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గురువారం సుల్తాన్ పూర్ కు చెందిన ఎన్. మల్లేష్ కు రూ. 60 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును శంభీపూర్ లోని కార్యాలయంలో అందజేశారు. అర్హులందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంసీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, మల్లంపేట్ మాజీ ఉప సర్పంచ్ అమర్నాథ్, తదితరులు పాల్గొన్నారు.