అర్హులైన వారందరికీ డబల్ బెడ్ రూములు ఇవ్వాలి

byసూర్య | Thu, Nov 24, 2022, 04:01 PM

సిపిఐ ఆధ్వర్యంలో వైరా తహసీల్దార్ కార్యాలయం ముందు మండలంలో అర్హులైన వారు అందరికీ రేషన్ కార్డులు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలి అని గురువారం ఆందోళన చేసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి యామాల గోపాలరావు, మాట్లాడుతూ టిఆర్ఎస్ అధికారం చేపట్టి 8 సంవత్సరాల కావస్తున్న అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు డబల్ బెడ్ రూమ్ ఇల్లు దళితులకు మూడు ఎకరాల భూమి ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూములు మంజూరు చేయలేదు అని అన్నారు. ఎంతో మంది నిరుపేదలు తెల్ల రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నిరుపేద ప్రజలకు న్యాయం చేయాలి అని అన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి రాఘవరావు, రైతు సంఘం జిల్లా కౌన్సిల్ సభ్యులు బండారుపల్లి ముత్తయ్య , ఏఐటీయూసీ మండల కార్యదర్శి గారపాటి అశోక్, మూటకొండ, ఆళ్ల రాంబాబు గంజనుబోయిన తిరుమలయ్య, బట్టు లక్ష్మయ్య, కొండ రామకృష్ణ, బండారుపల్లి రవి పుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు Thu, Apr 18, 2024, 03:37 PM
రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం Thu, Apr 18, 2024, 03:34 PM
ఘనంగా పెద్దమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు Thu, Apr 18, 2024, 03:32 PM
హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:29 PM
ఇద్దరు బాలికల అదృశ్యం Thu, Apr 18, 2024, 03:27 PM