byసూర్య | Thu, Nov 24, 2022, 02:14 PM
రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు పి. సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. టిపిసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కడెం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఆందోళన చేశారు. అనంతరం స్థానిక తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. రైతులకు మేలు జరిగేలా ఏకకాలంలో పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడెం మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.