byసూర్య | Thu, Nov 24, 2022, 11:59 AM
ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్లలో నెలకున్న మౌలిక సమస్యల న్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా పరిష్కరించి ఎల్బీనగర్ ను ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దటమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన చంపాపేట డివిజన్ పరిధిలోని ఎసీఆర్, సాయిరామ్ నగర్ కాలనీలో 41 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. కాలనీలలో అభివృద్ధి పనులు జరిగేటప్పుడు కొంత కాలం అసౌకర్యంగా ఉంటుందని, దానికి కాలనీవాసులు సహకరించాల్సిందిగా కోరారు.