byసూర్య | Thu, Nov 24, 2022, 11:35 AM
ఐటీ శాఖ దాడులపై మంత్రి మల్లారెడ్డి గురువారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పించాం. బీజేపీ కుట్రలకు భయపడేది లేదు. కేంద్ర బలగాలతో మాపై పెద్దఎత్తున దాడులు చేశారు. మమ్మల్నే కాదు, కేసీఆర్ కూడా ఏమీ చేయలేరు. మెడికల్ సీట్ల అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయని అంటున్నారు. మెడికల్ సీట్లకు డొనేషన్ తీసుకోవట్లేదు. కొడుకు, కోడలు ఆస్పత్రిలో ఉన్నారని చెప్పినా నన్ను విడిచి పెట్టలేదు' అని అన్నారు.