byసూర్య | Thu, Nov 24, 2022, 11:34 AM
నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని తిప్పారెడ్డిపల్లి గ్రామంలో గల క్లస్టర్ రైతు వేదికలో నేటి నుంచి ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేస్తామని క్లస్టర్ ఏఈఓ జైపాల్ తెలిపారు. రైతులు తమ భూమి పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ కాపీలతో రైతు వేదికలో సంప్రదించి టోకెన్ లు తీసుకోవాలని కోరారు.