byసూర్య | Thu, Nov 24, 2022, 10:52 AM
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. సుమారు 400 మంది అధికారులు 65 బృందాలుగా ఏర్పడి 2 రోజులు మంత్రి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే మల్లారెడ్డి బంధువులు, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. టర్కీలో ఉన్న రాజశేఖర్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. మరోవైపు ఈ సోదాలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.