byసూర్య | Thu, Nov 24, 2022, 10:51 AM
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈ కార్తీకమాసం కలిసి వచ్చింది. చివరి రెండు ఆదివారాలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారాలలో దాదాపు 50 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గత సంవత్సరం కార్తీకమాసంలో ఆలయానికి రూ.7,35,10,307 ఆదాయం రాగా ఈసారి రూ.14,66,38,097 రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చినట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు.