byసూర్య | Thu, Nov 24, 2022, 10:43 AM
మల్లాపూర్ డివిజన్ పరిధిలోని లబ్దిదారులకు సీఎంఆర్ చెక్కులను ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అందజేశారు. అనారోగ్యంతో ప్రవేటు హాస్పిటల్లో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ముగ్గురు లబ్దిదారులు సాయిలుకు రూ. 52వేలు, రేవతికి రూ. 24వేలు, జయరాజుకు రూ. 18వేల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు పళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి, సీతాల విజయ్, నర్సింగ్ రావు, భూమండ్ల శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.