వాషింగ్టన్‌ డీసీ వేదికకు సంగారెడ్డి యువతి

byసూర్య | Thu, Nov 24, 2022, 09:27 AM

జీవశాస్త్రంలో ఉన్నత విద్యనభ్యసించిన సంగారెడ్డికి చెందిన యువతికి అరుదైన గౌరవం లభించింది. గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఏబీ)లో డాక్టర్‌ గిరీశ్‌ కె రాధాకృష్ణన్‌ మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీ చేస్తున్న కిరణ్మయి జోషికి అమెరికా ఇనిస్టిట్యూట్‌ నుంచి ఆహ్వానం అందింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో డిసెంబరు 3 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ఈ సదస్సులో తాను పరిశోధన చేస్తున్న. జంతువుల నుంచి సంక్రమించే బ్రుసెల్లోసిస్‌ అనే బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ మీద కిరణ్మయి 15 నిమిషాలపాటు ప్రసంగించనున్నారు. బ్రుసెల్లోసిస్‌ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించి, నయం చేసేందుకు అవసరమైన పరిశోధనను కిరణ్మయి జోషి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 600 మంది ఔత్సాహికులు దరఖాస్తు చేసుకుంటే 16 మందికి మాత్రమే సదస్సుల్లో ప్రసంగించే అవకాశం దక్కింది. అందులో మనదేశం నుంచి కిరణ్మయి ఒక్కరికే ఈ అవకాశం రావడం విశేషం.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM